ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పిఆర్సి, డీఏ, పిఎఫ్, ఎపిజిఎల్ఐ బకాయిలపై శ్వేత పత్రం ప్రకటించాలని ఎస్టీయు రాష్ట్ర, జిల్లా నాయకులు నాగరాజు, వీరచంద్ర యాదవ్, లోక్యా నాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆదోనిలోని నెహ్రూ మెమోరియల్ పురపాలక ఉన్నత పాఠశాలలో సమావేశంలో వారు మాట్లాడారు. త్వరలోనే అన్ని బకాయిలు మంజూరు చేయాలని కోరారు. నాయకులు రవి, భీమరాజు పాల్గొన్నారు