షాపుల యజమానులు పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకొని ట్రాఫీక్ సమస్యను పరిష్కరించాలని ఆదోని హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ జిల్లా ఛైర్మన్ హెచ్ కె శ్రీకాంత్ రావు కోరారు. శనివారం ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథికి వినతి పత్రం అందించారు. కాలువపై ఫుట్పాత్ వేసి వాహనదారులతోపాటు పాదచారుల ఇబ్బందులు తొలగించాలని కోరారు. సభ్యులు జె శ్రీకాంత్, ప్రసాద్ పాల్గొన్నారు.