ఆదోని శివశంకర్నగర్లో వర్షాలు పడడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ కాలువ చిన్నగా ఉండటంతో వర్షపు నీరు బయటకు వెళ్లకుండా మురికి నీరు ఇళ్లలోకి ప్రవేశిస్తోంది. దీంతో తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోంది. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ, అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.