మే 31న సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో సిద్దేశ్వరం వద్ద ప్రజా బహిరంగ సభ జరుగనున్న సందర్భంగా శనివారం శిరువెల్ల మండలం యర్రగుంట్లలో రైతులతో సమావేశమై వై. యన్. రెడ్డి మాట్లాడారు. రాయలసీమ ప్రాజెక్టులకు నిధుల కొరత, కృష్ణా నదిపై ఏర్పాటైన యాజమాన్య బోర్డు వంటి అంశాల్లో ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సాగునీటి హక్కుల సాధనకు ప్రతి ఒక్కరూ సభలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.