నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలోని గోవిందపల్లె గ్రామంలో శుక్రవారం జరిగిన శ్రీ ఉమామహేశ్వర స్వామి పున: ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఎద్దుల బండలాగు పోటీలను ప్రారంభించి గ్రామీయ సంస్కృతిని ప్రోత్సహించేలా సందేశం ఇచ్చారు.