పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలనే పూజించాలి

77చూసినవారు
పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలనే పూజించాలి
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలందరూ మట్టితో తయారు చేసిన వినాయకులనే ప్రతిష్టించి పూజించాలని ఆళ్లగడ్డ తహసిల్దార్ జ్యోతి రత్నకుమారి అన్నారు. శుక్రవారం తమ కార్యాలయంలో మట్టితో తయారు చేసిన గణేష్ విగ్రహాలను రెవెన్యూ సిబ్బందికి పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడంతో నీరు కలుషితమవుతుందన్నారు.

సంబంధిత పోస్ట్