ఆలూరు: కూలీల బొలెరో వాహనం బోల్తా... ముగ్గురి పరిస్థితి విషమం

73చూసినవారు
ఆంధ్ర - కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో మంగళవారం కూలీలతో వెళ్తున్న బొలెరో బోల్తా పడటంతో సుమారు 30 మందికి పైగా గాయాలయ్యాయి. బళ్లారి జిల్లా మోకా గ్రామానికి చెందిన కూలీలు ఆలూరు, ఆస్పరి మండలాలకు పత్తి తీసేందుకు వెళ్తుండగా వాహనం టైరు పేలి బోల్తా పడింది. అందులో ఉన్న కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఓ బాలుడు, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

సంబంధిత పోస్ట్