ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ మండల కేంద్రంలోని పొగాకు రైతులను బుధవారం ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ, జీబీఐ కంపెనీ నాసిరకం సరుకు వల్ల రైతులు మోసపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధరలేక రైతులు రోడ్డున పడ్డా, కూటమి ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. రైతులకు వెంటనే సహాయం అందించాలని డిమాండ్ చేశారు.