హోళగుంద మండలం పెద్దహ్యట గ్రామంలో కొనసాగుతున్న రీసర్వే ప్రక్రియను మంగళవారం ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రీసర్వే అంశాలపై ఆధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం గ్రామ సచివాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో తహశీల్దార్ నిజాముద్దీన్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య, మండల సర్వేయర్ శ్రీనివాసులు ఇతర అధికారులు పాల్గొన్నారు.