రాష్ట్రంలో ఏడాది క్రితం ఇదేరోజు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని చీకటి యుగంలోకి నెట్టి వేసిందని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి విమర్శించారు. ఆదివారం కర్నూలులో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఏడాది కాలపు పాలనతో ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని, చంద్రబాబు, లోకేష్లు రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం పేరిట ఒక అరాచక పాలనకు నాంది పలికారన్నారు.