జమ్మూకశ్మీర్లో జరిగిన ఘర్షణలో శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం కళ్ళి తండా గ్రామానికి చెందిన తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం చెందారు. ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆయన త్యాగాన్ని స్మరిస్తూ శుక్రవారం మురళీనాయక్ కుటుంబానికి ఒక ప్రకటనలో ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన మురళీనాయక్ సేవలు చిరస్మరణీయమని అన్నారు.