హొళగుంద మండలం ముద్దటమాగి గ్రామం వద్ద విద్యుత్ తీగలు తగిలి ట్రాక్టర్ లో ఉన్న వరిగడ్డి దగ్ధమైంది. ఆదివారం స్థానికుల సమాచారం మేరకు. గ్రామానికి చెందిన రైతు రూ. లక్ష విలువైన వరిగడ్డిని పశువుల మేత కోసం కొనుగోలు చేసి, గ్రామానికి తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. డ్రైవర్ చాకచక్యంతో అప్రమత్తంగా ట్రాక్టర్, ట్రాలీని వేరు చేసినప్పటికీ గడ్డి మొత్తం కాలిపోయింది.