ఆలూరు నియోజకవర్గం హలహర్వి మండలం బాపురం గ్రామానికి చెందిన వైయస్సార్సీపీ నాయకుడు చిగానందు శుక్రవారం అనారోగ్యంతో మరణించాడు. విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.