ఆస్పరి మండల కేంద్రంలో బుధవారం స్థానిక మార్కెట్ నుంచి ర్యాలీగా బయలుదేరిన అంగన్వాడీ కార్యకర్తలు ఎమ్మార్వో ఆఫీస్ ముందు సిఐటియు నాయకులు రంగ స్వామి అధ్యక్షతన ధర్నా చేశారు. ధర్నాను ఉద్దేశించి సిఐటియు నాయకులు మాట్లాడుతూ, టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది గతంలో అంగన్వాడీలకు వేతనాలు పెంచుతాము ఐసిడిఎస్ ను బలోపేతం చేస్తామన్న హామీలు నేటికి నెరవేరలేదు అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.