ఆలూరులో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కుటుంబసభ్యులు వేసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ఇక టీడీపీకి పూర్వ వైభవం గుమ్మనూరు కుటుంబంతోనే సాధ్యమంటూ ఫ్లెక్సీలు వేయడంతో టీడీపీ వర్గాల్లో చర్చంశనీయంగా మారింది. అయితే ఆలూరుకు ఇప్పటికీ టీడీపీ ఇన్చార్జిను అధికారికంగా ప్రకటించలేదు. ఈ క్రమంలో మాజీ మంత్రి, కుమారుడు ఈశ్వర్, నారాయణస్వామి, శ్రీనివాసులతో ఫ్లెక్సీలు వేస్తూ, వినాయకచవితి శుభాకాంక్షలు తెలుపడం చర్చకు దారితీస్తుంది.