పి. కోటకొండలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

63చూసినవారు
పి. కోటకొండలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలం పి. కోటకొండ గ్రామంలో ఎం. గిడ్డయ్య (36) అనే రైతు అప్పుల బాధ తాళలేక సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తనకున్న 2 ఎకరాల సొంత పొలంతో పాటు 4 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని పంటలు సాగు చేసేవారు. అప్పులు చేసి సాగు చేసినా పంటలు అంతంత మాత్రమే రావడంతో వాటిని తీర్చే మార్గం తెలియక, ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయనకు కొడుకు, కూతురు సంతానం.

సంబంధిత పోస్ట్