బనగానపల్లె మండలంలోని టంగుటూరులో రైతు పొలంలో నిల్వ చేసుకున్న పొగాకు బేళ్లు దగ్ధం కావడంతో రూ. 8లక్షలు ఆస్తి నష్టం సంభవించిన ఘటన గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కౌలు రైతు ఆకుమల్ల రాజన్న 5 ఎకరాల్లో పొగాకు సాగు చేసి బేళ్లు ఏర్పాటు చేసుకున్నారు. ఉన్నట్టుండి మంటలు వ్యాపించి కాలిపోవడంతో తీవ్రంగా నష్టపోయినట్లు వాపోయారు. ప్రమాదమా, కావాలని ఎవరైనా చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.