బనగానపల్లె బస్టాండ్ సమీపంలోని గోల్డెన్ బేకరీపై మంగళవారం ప్లాస్టిక్ కవర్ల వినియోగానికి సంబంధించి డిప్యూటీ ఎంపీడీవో సతీష్ కుమార్ రెడ్డి రూ.5,000 జరిమానా విధించారు. గ్రామ పంచాయతీ నిధులలోకి ఈ మొత్తం జమ చేశారు. పట్టణ వ్యాపారులు ప్లాస్టిక్ వాడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.