బనగానపల్లె నగర శివారులో రవలకొండ మీద వెలసిన చెంచులక్ష్మి సమేత పావన నరసింహ స్వామి దేవస్థానం నందు సుదర్శన హోమం మంగళవారం ఘనంగా నిర్వహించడం జరిగిందని దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షులు, మరియు ప్రధాన అర్చకులు అయిన బాలిశెట్టి పావన నరసింహమూర్తి విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు, కుంకుమార్చనలు మరియు సుదర్శన హోమం చేయడం జరిగినది.