బనగానపల్లె మండలం కైపలో జరుగుతున్న రహదారుల పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మంగళవారం పర్యవేక్షించారు. రహదారుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా, రోడ్ల అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరతగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు