బనగానపల్లె నియోజకవర్గం అవుకు గ్రామంలోని శ్రీ భూదేవి సమేత చెన్నకేశవ స్వామిని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శనివారం సతీసమేతంగా దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, సుభిక్షానికి స్వామివారి కరుణ కలగాలని భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు. ఆలయ ప్రాంగణంలో అధికారులతో మాట్లాడి అభివృద్ధి పనుల వివరాలు తెలుసుకున్నారు. భక్తుల సౌకర్యాల కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.