ప్రజల పక్షాన నిలిచి ప్రజల బాగోగులు చూసిన నేతను వదులుకున్నామని రాష్ట్ర ప్రజలు ఆవేదన చెందుతున్నారని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి బుధవారం అన్నారు. వైయస్సార్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం బనగానపల్లెలో మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి స్వగృహ ఆవరణలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్ర బోతుల పాపిరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.