బనగానపల్లె పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కడప క్వాలిటీ కంట్రోల్ ఎస్సీ శివకుమార్, క్వాలిటీ కంట్రోల్ ఈఈ గీతారాణి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి, మంత్రికి వారు అభినందనలు తెలిపారు. అనంతరం వారి శాఖకు సంబంధించిన అంశాలపై చర్చించారు.