బనగానపల్లె మండలంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం యాగంటిలో వెలసిన శ్రీ ఉమామహేశ్వర స్వామి, అమ్మవార్లకు సోమవారం పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక అలంకరణ గావించి పల్లకిలో కొలువుదీర్చి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయత్వం పొందారు.