అవుకు మండలంలోని కొండమనాయునిపల్లె గ్రామం నాయకులు శుక్రవారం రోడ్డు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని బనగానపల్లెలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొండమనాయునిపల్లె గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని వారితో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో రాథోడ్ సీమకృష్ణ, సుబ్బయ్య, శ్రీరాములు నాయక్, చిన్న బాలసుంకన్న, నారాయణ స్వామి, హరి, వెంకటన్న, రమేశ్, నాగేంద్ర పాల్గొన్నారు.