ఈ సీజన్ లో కౌలుకు పొలం తీసుకొని పొలం సాగు చేస్తున్న కౌలు రైతులు, కౌలు దారు పత్రాలు ఉంటేనే ఏవైనా ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని బేతంచెర్ల వ్యవసాయ అధికారి జి. కిరణ్ కుమార్ బుధవారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న అన్నదాత సుఖీభవ పథకం పొందాలంటే, కౌలు రైతులు ఖచ్చితంగా కౌలు పత్రాలు పొందాలని అన్నారు. రైతులకు కౌలు పత్రాలపై అవగాహన కల్పించారు.