బేతంచెర్ల మండల పరిధిలో ఆర్ఎస్ రంగాపురం గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్ఎచ్ఎం కింద సిహెచ్ఓలుగా పనిచేస్తున్నామని వారు తెలిపారు. గత 2సంవత్సరాలుగా జీత భత్యాలా విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామన్నారు. ఇందుకు సంభందించి తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్ఎస్ రంగాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. భాస్కర్, ఆచారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.