పూదోట లింగావదూత స్వామి వారి ఆశ్రమంలో వెలసిఉన్న శ్యామలా మాతా సమేత భేతేశ్వర స్వామికి మంగళవారం నాడు15 కేజీల పంచలోహ నాగాభరణంను బేతంచెర్ల మండలం గూటు పల్లె గ్రామ వాసులు శ్రీకాంత్ , కిరణ్ లు కలిసి శ్రీ భేతేశ్వర స్వామి వారికి సమర్పించారు. పూదోట మఠం నిర్వాహాక కమిటివారు నాగాభరణం సమర్పించిన భక్తులకుటుంబ సభ్యులందరికీ ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు సదా ఉండాలని కోరుకున్నారు.