బేతంచెర్ల మండలం ఆర్ఎస్. రంగాపురం గ్రామ పరిధిలో కొలువై ఉన్న శ్రీ మద్ధిలేటీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం నందున్న మద్ధిలేటీ స్వామికి హుండిలలో భక్తులు సమర్పించిన కానుకలను గురువారం లెక్కింపు చేపట్టారని కార్య నిర్వహణ అధికారి రామాంజనేయులు గురువారం తెలిపారు. హుండీలో 20 లక్షల 35 వేల 730 రూపాయలు నగదు, 7 గ్రాముల 26 మిల్లి గ్రాముల బంగారు మరియు 800 గ్రాముల 120 మిల్లి గ్రాముల వెండి వచ్చిందన్నారు.