ఉచిత ఇసుక విధానంతో రాష్ట్రప్ర గతికి ఎంతో మేలు జరుగుతుందని, పేదల సొంతింటి కలలు నెరవేరుతాయని తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన నెలలోపే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఫించన్ల పెంపు, ఉచిత ఇసుకపాలసీ విధానం అమలు చేయటం సంతోషదాయకమన్నారు. గత వైకాపా పాలనలో జగన్మోహన్ రెడ్డి ఇసుక మాఫి యాతో రూ. కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు.