వైయస్సార్సీపి పార్టీ స్థాపించి 15 ఏళ్లు అవుతుంది. డోన్ వైయస్సార్ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. వైసిపి నాయకులు వైసిపి జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరాములు, డోన్ ఎంపీపీ శేఖర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జాకీర్ హుస్సేన్, వాలంటరీ విభాగం అధ్యక్షుడు ప్రసాద్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.