కర్నూలు మండలం మునగాలపాడు గ్రామంలో శనివారం నవోదయము 2. 0, కేర్ మద్యపాన వ్యసన విముక్తి కార్యక్రమం నిర్వహించారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రాజశేఖర్ గౌడ్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామకృష్ణ రెడ్డి, రాజేంద్రప్రసాద్, సీఐ చంద్రహాస్ హాజరై, నాటుసారా నిర్మూలన, మద్యపాన వ్యసనాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. వ్యసన విముక్తి కోసం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.