కోడుమూరు స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడ్డ వాహనాలను ఈనెల 28న సెబ్ సూపరింటెండెంట్ రవికుమార్ ఆధ్వర్యంలో వేలం వేస్తున్నట్లు సెబ్ సీఐ రామాంజినేయులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించే వాహనాల వేలం పాటలో ఆసక్తి వ్యక్తులు పాల్గొని వాహనాలు పొందవచ్చునని సీఐ రామాంజనేయులు వివరించారు.