గూడూరు మండలంలోని తిమ్మాపురం చెరువు సమీపంలో పురాతన అంజనేయస్వామి ఆలయంలో గుప్త నిధుల కోసం గుర్తు తెలియని దుండగులు తవ్వకాలు జరిపినట్లు ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూజలు చేసేందుకు రైతలు ఆలయానికి వెళ్ళారు. ఆలయంలో గుప్త నిధుల కోసం గుర్తు తెలియని దుండగులు తవ్వకాలు జరిపినట్లు వారికి తెలిసింది. ఈ విషయాన్ని రైతులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. గూడూరు పోలీసులు ఆలయానికి వెళ్ళి పరిశీలించారు.