గూడూరు పట్టణంలో వైసీపీ నాయకురాలు చిలకమ్మా అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం స్థానిక వైసీపీ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఇన్ ఛార్జి ఆదిమూలపు సతీష్ గూడూరులో ఆమె పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించి, సానుభూతి తెలిపారు. ఆయనతో పాటు మున్సిపల్ చైర్మన్ జె. వెంకటేశ్వర్లు, ఇతర స్థానిక నాయకులు, కార్యకర్తలు వెంట ఉన్నారు.