గూడూరులో దొంగతనాలు చోటుచేసుకున్నాయి. స్థానిక సిఐటియు డివిజన్ కార్యదర్శి మోహన్ తన కుటుంబంతో అనంతపురానికి వెళ్లగా, దొంగలు ఆయన ఇంటి తాళాలు పగలగొట్టి నాలుగు తులాల బంగారం దోచుకెళ్లారు. సుమారు నాలుగు తులాల బంగారం పోయినట్లు మోహన్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న అనంతరం, ఈ ప్రాంతంలో మరిన్ని దొంగతనాలు జరిగినట్లు సమాచారం రావడంతో, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.