గూడూరు నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశం శనివారం నిర్వహిస్తున్నట్లు నగర పంచాయతీ కమిషనర్ దివాకర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గూడూరులో ఆయన మాట్లాడారు. నగర పంచాయతీ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం చైర్ మన్ జూలపాల్ వెంకటేశ్వర్లు ఆధ్యక్షతన జరుగుతుందని తెలిపారు. కావున గూడూరు నగర పంచాయతీ కౌన్సిలర్లు అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఈ సందర్భంగా కమీషనర్ దివాకర్ రెడ్డి కోరారు.