గూడూరు సబ్ డివిజన్ పరిధిలో కోడుమూరు, గూడూరు, సి. బెళగల్ ఫీడర్ల పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డిప్యూటీ ఈఈ జేసన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని 33/11 కె. వి సబ్ స్టేషన్లలో ఫీడర్లో మరమ్మతులు నిర్వహించనున్నందున ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తామన్నారు. రైతులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు సహకరించాలని కోరారు.