కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు సబ్డివిజన్ పరిధిలో శనివారం ఉదయం 9: 30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 33 కె. వి సి. బెళగల్, లద్దగిరి ఫీడర్లలో మైంటెనెన్స్ పనుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. గూడూరు, కోడుమూరు, సి. బెళగల్ మండలాల్లోని వినియోగదారులు ఈ కాలంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, వినియోగదారులు సహకరించాలని డిప్యూటీ ఈఈ జేసన్ సూచించారు.