సి. బెళగల్ మండలం పోలకల్ గ్రామానికి చెందిన పల్ దొడ్డి నాగప్పతో పాటు 15 కుటుంబాలు శుక్రవారం తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కర్నూలులో గల కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పరిగెల మురళీకృష్ణ, సుధాకర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. సి. బెళగల్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వారు తెలిపారు.