కోడుమూరు: ఒకే రోజులో బీజేపీకి వంద సభ్యత్వాలు

84చూసినవారు
కోడుమూరు: ఒకే రోజులో బీజేపీకి వంద సభ్యత్వాలు
కోడుమూరు మండలంలోని స్థానిక చిన్న బోయ వీధిలో బీజేపీ మహిళా అధ్యక్షురాలు మంజుల నాయుడు సమక్షంలోఒక్క రోజులోనే బీజేపీికి 100 సభ్యత్వాలు నమోదయ్యాయి. జనాలు కూడా మోదీ అభివృద్ధిని చూసి పార్టీ సభ్యత్వాలు తీసుకోవడానికి ఉత్సాహం చూపించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు, బీజేపీ కార్యకర్త హనుమంతు నాయుడు పాల్గొన్నారు. ప్రజలకు బీజేపీ మీద ఆసక్తిని చూస్తుంటే పార్టీ మండలంలో బలపడుతుందని చెప్పొచ్చని నేతలు అంటున్నారు.

సంబంధిత పోస్ట్