కోడుమూరు: పెళ్లిళ్లలో డీజేలకు అనుమతి లేదు

74చూసినవారు
కోడుమూరు: పెళ్లిళ్లలో డీజేలకు అనుమతి లేదు
కోడుమూరు మండలంలో పెళ్లిళ్లకు డీజేలకు అనుమతి లేదని ఎస్సై ఎర్రిస్వామి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ, ఇటీవల అర్ధరాత్రి వరకు డీజేలు వినిపిస్తున్నాయన్న ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. అధిక శబ్దంతో శబ్ద కాలుష్యం పెరిగి ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. నియమాలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. శబ్ద కాలుష్యంతో వృద్ధులు, రోగులు, పిల్లలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్