కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్రతి వార్డులో శానిటేషన్ బాగా లేదని, పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ సెక్యూరిటీ సమస్యలు లేకుండా చూడాలని, ఐసీయూలో ఫ్లోరింగ్ సరిగ్గా లేదని దాన్ని సరి చేయాలని సూచించారు. ఆస్పత్రిలోనే రోగులకు పరీక్షలు జరిగే చర్యలు తీసుకోవాలన్నారు.