గూడూరు మండలంలోని రైతుల భూములు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రీసర్వే చేసి పట్టాదారు పుస్తకాలు ఇవ్వడం ద్వారా సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని తహసీల్దార్ రామాంజనేయులు అన్నారు. గురువారం పట్టణంలో తహసీల్దార్ రామాంజనేయులు ఆధ్వర్యంలో రైతుల భూములకు సంబంధించిన రీ-సర్వేపైహఅధికారులు అవగాహన ర్యాలీని నిర్వహించారు. రైతులు రీసర్వే సిబ్బందికి సహకరించి తమ భూములను సర్వే చేయించుకోవాలని సూచించారు.