కోడుమూరు నియోజకవర్గం సి. బెళగల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి హాజరైయ్యారు. మండల కేంద్రం నుంచి జిల్లా పరిషత్ హైస్కూల్ వరకు కొటార్ మిట్ట స్కూల్ వరకూ సీసీరోడ్డు, డ్రైన్ నిర్మించాలనీ మాజీ జడ్పీటీసీ సభ్యులు చంద్రశేఖర్ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. ఎంపీడీవో రాణెమ్మ, వార్డు సభ్యులు, సర్పంచ్లు పాల్గొన్నారు.