కోడుమూరు నియోజకవర్గంలోని సి. బెళగల్ మండలం పోలకల్ గ్రామంలో కలుషితమైన తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జనసేన నాయకులు సంధ్యా విక్రమ్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన పోలకల్ గ్రామాన్ని సందర్శించి, నీటి స్టోరేజ్ ట్యాంకును పరిశీలించారు. గ్రామస్తులు ప్యూరిఫికేషన్ యంత్రాలు పనిచేయడం లేదని తెలిపారు. త్వరలో శుద్ధి చేసిన నీరు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.