క్రికెట్ బెట్టింగ్, అసాంఘిక కార్యకలాపాలకు యువత దూరంగా ఉండాలని సి. బెళగల్ ఎస్సై పరమేష్ నాయక్ సూచించారు. గురువారం ఆయన సి. బెళగల్ లో మాట్లాడుతూ. మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు తావు ఉండదన్నారు. ప్రజలు ఎలాంటి ఫిర్యాదు చేసినా వెంటనే స్పందిస్తామని, ఎప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. కర్నూలు వీఆర్ నుంచి బదిలీపై సి. బెళగల్ కు వచ్చినట్లు తెలుపారు. ఇక్కడ పనిచేస్తున్న తిమ్మారెడ్డి కర్నూలుకు వెళ్లారు.