ప్యాలకుర్తి: హోరాహోరీగా రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు

51చూసినవారు
కోడుమూరు మండలం పాలకుర్తి గ్రామంలో రాష్ట్రస్థాయి ఎద్దుల బండలాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. శుక్రవారం నిర్వహకులు తెలిపిన వివరాల ప్రకారం 24 జతల ఎద్దులు పాల్గొన్న ఈ పోటీలో బి. తాండ్రపాడుకు చెందిన వరలక్ష్మి ఎద్దులు 4986 అడుగులు లాగి మొదటి స్థానం దక్కించుకున్నాయి. తొమ్మిది జట్లకు దాతలు రూ. 50 వేల నుంచి రూ. 3 వేల వరకు నగదు బహుమతులు అందజేశారు. ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్