ఆర్టీసీ బస్సు - బైక్ ఢీ... ఇద్దరు మృతి

16186చూసినవారు
గూడూరు మండలం కె. నాగలాపురం పోలీసు స్టేషన్ పరిధిలోని సల్కాపురం గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. ఆర్టీసీ బస్సు - బైక్ ఎదురెదురుగా వచ్చి ఢీకోనంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ ప్రమాదంలో గూడూరుకు చెందిన వీరనాగేంద్ర, పత్తికొండకు చెందిన మధు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్