AP: ఇంటర్మీడియట్ విద్యా మండలి శనివారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో కర్నూలుకు చెందిన మహమ్మద్ రిహాన్ ప్రతిభ చాటాడు. నారాయణ కాలేజీలో బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న రిహాన్ 440 పరుగులకు గాను 434 మార్కులు సాధించాడు. ఫిజిక్స్,కెమిస్ట్రీ, బొటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో 60 మార్కులకు 60 మార్కులు రాగా ఇంగ్లీష్లో 95, ఆప్షనల్ లాంగ్వేజ్లో 99 మార్కులు సాధించి స్కూల్ టాపర్గా నిలిచాడు.